మాతృవియోగంతో విషాదంలో ఉన్న భూపాలపల్లి జిల్లా మహాజన సోషలిస్టు పార్టీ ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షుడు గట్ల రాజయ్య ను ములుగు జిల్లా సాధన సమితి, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ నేడు పరామర్శించారు. జంగాలపల్లి గ్రామానికి చెందిన గట్ల రాజయ్య తల్లి లక్ష్మి అనారోగ్యంతో గత నాలుగు రోజుల క్రితం మరణించారు. గట్ల రాజయ్య తల్లి మరణించడం చాలా బాధకరమని బిక్షపతి అన్నారు.
గట్ల రాజయ్య ఉద్యమకారుడు అని బిక్షపతి అన్నారు. ఆమె మరణం తీరని లోటు అని ఆయన అన్నారు. మహాజన సోషలిస్టు పార్టీ ఎం ఎస్ పి భూపాలపల్లి జిల్లా కో కన్వీనర్ నోముల శ్రీనివాస్, ఎం ఎస్ పి భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు దోర్నాల సారయ్య, ఎం ఎస్ పి జిల్లా కమిటీ సభ్యుడు గన్ పూర్ మండల అధ్యక్షులు వింజ పెళ్లి ప్రవీణ్ తదితరులు బిక్షపతి వెంట వెళ్లి ములుగు మండలం జంగాల పల్లి గ్రామంలో సొంత గ్రామంలో గట్ల రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు.