30.7 C
Hyderabad
April 29, 2024 03: 50 AM
Slider నల్గొండ

నిర్మాణ రంగం కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి

#cituhujurnagar

ప్రమాదంలో గాయపడిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్ర భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా కోశాధికారి చల్ల జయకృష్ణ ను మంగళవారం నాడు సిఐటియు  జిల్లా నాయకులు పరామర్శించారు.

ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు మాట్లాడుతూ ఈ ప్రమాదంలో గాయపడిన భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నిధులను మంజూరు చేసి కార్పొరేట్ వైద్యం అందించాలని,జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైమ్ లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్, పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న, పిల్లలమర్రి వెంకన్న,రామకృష్ణ,రాజు, బుచ్చయ్య, రమేష్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

చేనేతపై జీరో జీఎస్టీ అయ్యేలా కృషి చేయాలి

Sub Editor 2

పంజరంలో చిలక

Satyam NEWS

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment