ప్రమాదంలో గాయపడిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్ర భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా కోశాధికారి చల్ల జయకృష్ణ ను మంగళవారం నాడు సిఐటియు జిల్లా నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు మాట్లాడుతూ ఈ ప్రమాదంలో గాయపడిన భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నిధులను మంజూరు చేసి కార్పొరేట్ వైద్యం అందించాలని,జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైమ్ లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్, పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న, పిల్లలమర్రి వెంకన్న,రామకృష్ణ,రాజు, బుచ్చయ్య, రమేష్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్