సుప్రీంకోర్టు ఒక వర్గం వారికి అనుకూలంగా తీర్పును ఇచ్చినట్లుగా ఉందని మజ్లీస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అక్కడ బాబ్రీ మసీద్ ఉన్నట్లు శాస్త్రీయంగా తేలినా ఈ విధంగా తీర్పు చెప్పడం తమకు అసంతృప్తి కలిగించిందని ఆయన అన్నారు. ఈ విషయంలో ముస్లిం వర్గానికి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఈ తీర్పు అసంపూర్తిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం స్వాగతిస్తున్నాం అయితే మేము మరోసారి ఆపిల్ చేస్తున్నాం అని ఆయన ప్రకటించారు. ఐదెకరాల భూమి ఇవ్వడం ఎందుకు? మాకు ఆ స్థలం అవసరం లేదు అని ఆయన అన్నారు. తాము న్యాయబద్ధంగా పోరాటం చేసినా ల్యాండ్ కోల్పోవడం అనేది బాధాకరమని ఆయన తెలిపారు.