ఉత్తరాంధ్ర లో పారాది బ్రిడ్జి తెలియని వారుండరు. అందున విశాఖ నుంచీ పొరుగు రాష్ట్రం ఒడిశా లోని రాయఘడకు వెళ్లాలంటే పారాది మీదుగానే వెళ్లాలి. అలాగే అలనాటి బొబ్బిలి యుద్ధం లో ఆ పారాది అప్పుడే ప్రాచుర్యం పొందింది. తాజాగా అదే పారాది మళ్ళీ వార్తపుటలకెక్కింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లోని పారాది వద్దే నిర్మితమైన బ్రిడ్జి…. ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టుబడింది. ఆ పారాది బ్రిడ్జి మీదుగా నే నిత్యం ఎన్నో వాహనాలు, ఆర్టీసీ బస్సులు, అలాగే భారీ వాహనాలతో పాటు రాయఘడకు వెళ్లాలంటే ఈ ఆ పారాది బ్రిడ్జే ఆధారం కీలకం. అయితే తాజాగా ఆ పాత ఇనుము తో నిర్మితమైన బ్రిడ్జి అడుగు భాగం అడ్డంగా ఉన్న బ్రిడ్జి కాస్త కిందకు వీ ఆకారంలో ఒంగిపోవడంతో బ్రిడ్జి ఏ క్షణం అయిన కూలిపోయే ప్రమాదం జరగనుంది. ఈ పరిస్థితి ని స్థానికల ద్వారా తెలుసుకున్న బొబ్బిలి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు బొబ్బిలి డీఎస్పీ శ్రీధర్ హుటాహుటిన పారాది బ్రిడ్జి వద్దకు చేరుకుని.. పరిస్థితి ని కళ్లారా చూసి…ఈ రోజు రాత్రి నుంచే ఏ విధమైన ఫోర్ వీలర్స్ బ్రిడ్జి పై నుంచీ వెళ్లరాదని ముందస్తు చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల తో సుమోటోగా చర్యలు తీసుకున్నారు.
next post