కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు కుటుంబ సభ్యులతో కలిసి నేడు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. వన దేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ లను ఆయన ఆదివారం నాడు దర్శించుకుని బంగారం, మొక్కులను చెల్లించారు. పవిత్ర దేవతలైన సమ్మక్క సారలమ్మలు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని ఆయన తల్లులను వేడుకున్నారు.