తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ర్యాకం శ్రీరాములు ను నియమిస్తున్నట్లు తెలంగాణ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నాంపల్లి అంబేద్కర్, పూలే భవన్ లో జరిగిన తెలంగాణ మాల మహానాడు విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ర్యాకం శ్రీరాములు ను తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమిస్తూ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ కరికె శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది.
అలాగే మెదక్ జిల్లా ఇంచార్జ్ గా అదనపు బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ర్యాకం శ్రీరాములు మాట్లాడుతూ నా మీద నమ్మకం తోటి తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ కు, జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ కరికె శ్రీనివాస్, నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ నాయకత్వంలో దళిత బహుజనుల హక్కుల కోసం కృషి చేస్తానని, సమాజంలో దళితులు, మహిళల పై జరిగే దాడులు అత్యాచారాలను ఖండిస్తూ బాధితుల పక్షాన నిలబడి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని హామీ ఇస్తున్నాను.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ కరికె శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకట స్వామి, రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎలుక దేవయ్య, మెదక్ జిల్లా అధ్యక్షులు సామల అశోక్, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు తాడెం కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, జిల్లా నాయకులు రాసూరి మల్లికార్జున్,రాజు, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.