తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పుదుకొట్టె సమీపంలో ఓ ప్రైవేట్ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నామ సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని పుదుకొట్టె సమీపంలో తిరుచ్చి-రామేశ్వరం జాతీయ రహదారిపై వెళ్తున్న కారు, అటు నుంచి వస్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద ఘటన సీసీ దృశ్యాలు వైరల్ గా మారాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.