మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణం తీరని లోటని తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ఎడ్మ కిష్టారెడ్డి తనకు ఎంతో సన్నిహితుడని, అతని మరణం తనను కలచివేసిందని ఆయన తెలిపారు.
ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబానికి మల్లు రవి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మల్లు రవి ఆ భగవంతుడిని ప్రార్థించారు. రాజకీయ రంగానికి ఎడ్మ కిష్టారెడ్డి లేని లోటు తీర్చడం మరెవరి తరం కాదని మల్లు రవి అన్నారు.