నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని ఊరుకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ రాధా జంగయ్య అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై వివిధ సమస్యలపై అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి సమస్యలపై పరిష్కార దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ రాధా జంగయ్య మాట్లాడుతూ రైతు వేదికల తొందరగా పనులు పూర్తిచేయాలని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల లో పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేసిన అన్ని గ్రామాల సర్పంచులకు ఎంపీటీసీ లకు పంచాయతీ సెక్రటరీలకు పాలకమండలి కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు, జడ్పిటిసి శాంత కుమారి రవీందర్, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్రెడ్డి ,ఎంపిటిసిలు గోపాల గుప్త, ఈశ్వరమ్మ ముత్యాలు, కోఆప్షన్ ఖలీమ్ పాషా పాల్గొన్నారు.
ఇంకా, ఎంపీడీవో ప్రభాకర్ , ఎంపీడీవో వెంకటేశ్వర్లు , ఎమ్మార్వో రామచంద్రయ్య , వెటర్నరీ డాక్టర్ నాగరాజు ,విద్యుత్ శాఖ AE రవి, మండలం లోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీరితో బాటు సర్పంచులు కొమ్ము రాజయ్య, ఆంజనేయులు ,అనిల్ రెడ్డి , పర్వతరెడ్డి, ఆంజనేయులు, అనితనాగోజి ,శివరణి హరీష్ , శ్రీను నాయక్ , కవితమణిపాల్ రెడ్డీ , సునీతసాంబశివుడు, తదితరులు పాల్గొన్నారు.