25.7 C
Hyderabad
May 9, 2024 08: 52 AM
మహబూబ్ నగర్

గ్రామాలలో రైతు వేదికలు త్వరగా పూర్తి చేయాలి

#KalwakurthyMRO

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని ఊరుకొండ  మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ రాధా జంగయ్య అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మండలానికి  సంబంధించిన అభివృద్ధి అంశాలపై వివిధ సమస్యలపై అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి సమస్యలపై పరిష్కార దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ రాధా జంగయ్య  మాట్లాడుతూ రైతు వేదికల తొందరగా పనులు పూర్తిచేయాలని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల లో పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేసిన అన్ని గ్రామాల సర్పంచులకు ఎంపీటీసీ లకు పంచాయతీ సెక్రటరీలకు పాలకమండలి కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు, జడ్పిటిసి శాంత కుమారి రవీందర్,  వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్రెడ్డి ,ఎంపిటిసిలు గోపాల గుప్త, ఈశ్వరమ్మ ముత్యాలు,  కోఆప్షన్ ఖలీమ్ పాషా పాల్గొన్నారు.

ఇంకా, ఎంపీడీవో ప్రభాకర్ ,  ఎంపీడీవో వెంకటేశ్వర్లు , ఎమ్మార్వో రామచంద్రయ్య , వెటర్నరీ డాక్టర్ నాగరాజు ,విద్యుత్ శాఖ AE రవి, మండలం లోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

వీరితో బాటు సర్పంచులు  కొమ్ము రాజయ్య, ఆంజనేయులు ,అనిల్ రెడ్డి ,  పర్వతరెడ్డి, ఆంజనేయులు, అనితనాగోజి ,శివరణి హరీష్ , శ్రీను నాయక్ , కవితమణిపాల్ రెడ్డీ , సునీతసాంబశివుడు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రీన్ ల్యాండ్ ఉన్నత పాఠశాలలో కరోనా వైరస్ పై అవగాహన

Satyam NEWS

వనపర్తి లో మినీ హజ్ హౌస్ కు రూ. కోటి మంజూరు

Satyam NEWS

కొనుగోలు చేయాలంటూ రోడ్డుపైకి వచ్చిన కంది రైతులు

Satyam NEWS

Leave a Comment