ములుగు జిల్లాలో TRS నాయకుడిని మావోయిస్టులు హతమార్చారు. వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన TRS నాయకుడు మాడురి బిమేశ్వర్ రావును మావోయిస్టులు కత్తితో పొడిచి చంపారు.
ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బయటకు పిలిచి కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. సంఘటనా స్థలంలో మావోయిస్టుల లేక లభ్యం అయింది.
ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. అధికార పార్టీలో కొనసాగుతూ అమాయక ప్రజలను దోచుకుంటున్నాడని లేఖలో పేర్కొన్నారు.
TRS- బీజేపీ నాయకులు వెంటనే వారి పదవులు రాజీనామాలు చేయాలని, లేకపోతే వారికి కూడా ఇదే గతి పడుతుందని వారు హెచ్చరించారు.