37.2 C
Hyderabad
April 26, 2024 21: 42 PM
Slider విశాఖపట్నం

సిగ్నల్ వద్ద లారీ అదుపుతప్పి ఇద్దరు మృతి

#VizagRoadAccident

విశాఖలో అదుపు తప్పిన లారీ వరుస వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు తగిలాయి.

విశాఖలో ట్రాఫిక్ రద్దీ సమయంలో ఓ లారీ అదుపు తప్పింది. వరుసగా ఆగి ఉన్న వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు పలువురు గాయపడ్డారు.

హనుమంతవాక జంక్షన్ లో మధురవాడ వైపు వెళ్తున్న దిశలో లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడం తో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ ఆగి ఉన్న వాహనాలు ఢీ కొట్టింది.

దీంతో రెడ్ సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న బైక్ను ఢీకొనడంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు కూడా గాయపడ్డారు.

వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సాధారణంగా రద్దీగా ఉండే ఈ జంక్షన్ లో ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంది లేనట్లయితే నష్టం తీవ్రత ఎక్కువగా ఉండేది.

Related posts

ఉపాధి హామీ బిల్లులు 15లోగా చెల్లించకపోతే చర్యలు తప్పవు

Satyam NEWS

విద్యుత్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన జేఏసీ

Satyam NEWS

నరసరావుపేటలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం

Satyam NEWS

Leave a Comment