38.2 C
Hyderabad
May 5, 2024 21: 07 PM
Slider నల్గొండ

పార్టీలకు అతీతంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని లింగగిరి గ్రామంలో స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

లింగగిరి గ్రామం కాంగ్రెస్ పార్టీకి  చెందిన నాయకులు  షేక్ సుభాని, కర్ని అంజయ్య, కసర్ల రంగయ్య తో పాటు  సుమారు 100 మంది కార్యకర్తలు సైదిరెడ్డి  సమక్షంలో టి‌ఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి  మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధిచేస్తా అని అన్నారు. టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని అన్నారు.

అనంతరం గ్రామంలో శిథిలావస్థ దశలో ఉన్న పశువుల వైద్యశాలను, నర్సరీని పరిశీలించారు. పశువుల వైద్యశాల నూతన భవన నిర్మాణానికి తప్పక కృషి చేస్తానని తెలిపారు.

డిసెంబర్ లోగా లింగగిరి బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం‌పి‌పి గుడెపు శ్రీను, జెడ్‌పి‌టి‌సి కొప్పుల సైదిరెడ్డి,

మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ నభీ, మునీర్, సర్పంచ్ అంజిరెడ్డి, ఉప సర్పంచ్ రమారవి, ఎం‌పి‌టి‌సి విజయలక్ష్మి, కడియాల రమేష్,అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా?

Satyam NEWS

దేవరకొండలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం

Satyam NEWS

రాష్ట్రంలో 40వేల కోట్ల భూ దోపిడీ

Satyam NEWS

Leave a Comment