ప్రకాశం జిల్లా కంభం పట్టణం లోని కోనేటి వీధిలో కొరతమద్ది మహేశ్వరి (23) అనే వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. వివాహిత కు ఆరు సంవత్సరాల క్రితం కోనేటి వీధికి చెందిన వెంకట రంగయ్య తో వివాహం జరిగింది అని వీరికి ముగ్గురు సంతానం ఉన్నట్లు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ గల కారణాలు తెలియాల్సి ఉందని తదుపరి విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు.