25.2 C
Hyderabad
January 21, 2025 13: 48 PM
Slider శ్రీకాకుళం

పిల్లలకు ప్రస్తుత రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ అవసరం

skl school

శ్రీకాకుళం గ్రామీణ మండలం లో పెద్ద పాడు గ్రామం లో పెద్దపాడు ఉన్నత పాఠశాలలో గురువారం  ఉదయం  ఫిట్ ఇండియా భాగంగా విద్యార్థుల చేత మార్షల్ ఆర్ట్స్, ఏరోబిక్ , యోగ మెడిటేషన్, వ్యాసరచన పోటీలు, మొదలైనవి నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ ఖచ్చితంగా పై అంశాల్లో బాగా తర్ఫీదు పొందాలని అన్నారు. ముఖ్యంగా బాలికలకు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా పై అంశంలో విద్యార్థులను తర్ఫీదు ఇస్తున్న పాఠశాలలో పనిచేస్తున్న  వ్యాయామ ఉపాధ్యాయుడు గుండ బాబు మోహన్ కు ప్రత్యేక అభినందలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.సత్యవతి, ఎస్ .వి. కృష్ణారావు, ఎం. శాంతారావు, జి .భూషన్ రావు, డి .యమ్ .మల్లేశ్వరి, కే. సురేష్ కుమార్, క్రాఫ్ట్ బి. త్రివేణి, ఆర్ట్ సిహెచ్. రవికుమార్, అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతిచ్చిన డీజీపీ

Satyam NEWS

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జీ20 విదేశీ ప్రతినిధులు

mamatha

నరసరావుపేటలో ఘనంగా సూపర్ సండే వేడుకలు

Satyam NEWS

Leave a Comment