29.7 C
Hyderabad
May 2, 2024 04: 57 AM
Slider విశాఖపట్నం

అచ్యుతాపురం ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం

#Achyutapuram pharmacy

అనకాపల్లి జిల్లా జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పరిశ్రమలోని ఓ రియాక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించగా.. పేలుడు శబ్దానికి కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.

ఆ ప్రాంతంలో మంటలకు తోడు దట్టమైన పొగలు వ్యాపించగా సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. దాదాపు మూడు గంటలుగా శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు.

అచ్యుతాపురం ఫార్మాసిటీలో గల సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి చుట్టూ పొగలు కమ్ముకున్నాయి.

పేలుడు శబ్దం విన్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. కార్మికుల్లో పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుండగా.. ఇద్దకు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.బార్బెక్యూ రెస్టారెంట్​లో గ్యాస్ పేలుడు!.. 31 మంది దుర్మరణం

అగ్ని మాపక సిబ్బంది దాదాపు మూడు గంటలుగా శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రాకపోవడం, చుట్టు పక్కల మరిన్ని కంపెనీలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమీపంలోని స్టీల్ ప్లాంట్ ఫైరింజన్లను కూడా రప్పించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాహితి ఫార్మాలో 120 మంది కార్మికులు ఇవాళ విధులకు హాజరైనట్లు తెలుస్తుండగా.. ఈ ఘటనతో ఆయా కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి.

Related posts

ప్రభుత్వం దివ్యాంగులను ప్రోత్సహిస్తుంది

Satyam NEWS

ఈ నెల 31 వరకూ మళ్లీ లాక్ డౌన్ లోకి బీహార్

Satyam NEWS

వేడుకగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment