ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్మిక , ఉద్యోగులకు స్పూర్తి ఇస్తుందని ఈ స్పూర్తి తో మోదీ కార్మిక , ప్రవేటికరణ విధానాలపై పోరాడి మోదీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని , రాష్ట్ర ప్రభుత్వం మేడే ని శెలవు దినంగా ప్రకటించక పోవడం అన్యాయం అని ఆయన అన్నారు.
ఈరోజు మేడే జెండా ఆవిష్కరణ లలో భాగంగా దరిశి LIC ఎజెంట్లు ఆఫీసు వద్ద యూనియన్ జెండాని రాష్ట్ర నాయకులు రాగిపిండి రామ్ కోటిరెడ్డి , గడియారం స్థంభం సెంటర్ లో సిఐటియు , సిపియం జెండాలను ఆశా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు జాలా సుశీలా , సిఐటియు మండల అధ్యక్షుడు షేక్ కాలే భాష , ఆటో వర్కర్స్ జెండాని అంకాల నాగయ్య , ఉప్పు నారాయణ ఆవిష్కరించారు.
సుందరయ్య భవనం నుంచి మేడే ప్రదర్శన ప్రారంభించి LIC ఆఫీస్ వద్దకు ముగిసింది. 8 గంటల పని విధానం కొనసాగించాలి , లెబర్ కోడ్ లను రద్దు చేయాలని , అధిక ధరలను తగ్గించాలని , కార్మిక , ఉద్యోగ ఐక్యత కొనసాగాలని నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో అంజమ్మ , మోతీ భేగం , ఉప్పు మోహనరావు , గర్నిపూడి జాన్ సామ్యేల్ , గోగు వెంకయ్య , ఈమని నాగేశ్వరరావు , సుబ్బమ్మ పాల్గొన్నారు