మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, మేడిపల్లి మండలం, మేకల బాల్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఎంసిపిఐయు పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మేడిపల్లి మండల పార్టీ కార్యదర్శి కామ్రేడ్ మార్టిన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ తుకారం నాయక్, జిల్లా కార్యదర్శి ఎర్ర రాజేష్ లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పార్టీని పునర్నిర్మాణం చేయాలని సూచించారు. రానున్న ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపి ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని డివిజన్లో అభ్యర్థులను ఎన్నికలలో నిలబెట్టి వారిని బలోపేతం చేయాలన్నారు.
ముఖ్యంగా మేడ్చల్ డివిజన్, కుత్బుల్లాపూర్ డివిజన్, ఎంసిపిఐయు పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో ఉంటారని ఇప్పటినుండే అన్ని జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై పేద ప్రజల సమస్యలపై ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించి వారికి మేలు చేకూర్చే విధంగా ఎంసిపిఐయు పార్టీ తరఫున ప్రజలకు కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటినుండే పార్టీ సభ్యులందరూ ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమై వారి సమస్యలను తెలుసుకునే విధంగా పోరాటాలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసిపీఐయు పార్టీ జిల్లా నాయకులు ఆర్ రామచందర్, రవీందర్ గౌడ్, ఎన్ నాగరాజ్, టి. కృష్ణ, పి రాజు, ఎస్ జైపాల్, కుమార్, పరమేష్ శ్యామ్ సన్ జార్జ్, తదితర జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా