సిబిఐటి ఎన్ఎస్ఎస్ ఆగస్ట్ 12 నుండి ఆగస్టు 19 వరకు “యాంటీ ర్యాగింగ్ వారోత్సవాలు” నిర్వహించింది. వారం పాటు యాంటీ ర్యాగింగ్ థీమ్పై వివిధ పోటీలు జరిగాయి. వీటిలో “లోగో డిజైన్ కాంటెస్ట్” విద్యార్థులందరికీ “స్లోగన్ రైటింగ్ కాంటెస్ట్” జరిగాయి. రెండవ సంవత్సరం విద్యార్థి “భూపతి వంశీ కృష్ణ” లోగో డిజైనింగ్ కాంటెస్ట్ మరియు స్లోగన్ రైటింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచారు. విద్యార్థి వ్యవహారాల డైరెక్టర్ డా.పి.వి.ఆర్.రవీంద్రారెడ్డి సమక్షంలో ప్రిన్సిపాల్ డా.సి.వి.నరసింహులు విజేతకు సర్టిఫికేట్ బహూకరించారు. సిబిఐటి పి.ఆర్.ఓ.జి.ఎన్.ఆర్.ప్రసాద్, సిబిఐటి ఎన్ఎస్ఎస్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డా.ఎం.గణేశ్వర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
previous post