ఒడిస్సాలోని గంజమ్ జిల్లాలో పడమూడేళ్ల మైనర్ బాలిక ను నిర్బంధించి మగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.ఇంట్లో ఉన్న బాలికను అపహరించి 36 గంటలపాటు అత్యాచారం చేశారు.ఈ నెల 10వ తేదీన బాలికను తీసుకెళ్లిన నిందితులు 12న ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయారు. ఇంట్లో విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలికను ఇంట్లో నుంచి ఎత్తకెళ్లి బంధించి ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలికను వైద్య పరీక్షలు కోసం ఆస్పత్రికి తరలించారు.పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, పోస్కో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.