మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం నేడు భక్తులతో కిటకిటలాడింది. వనదేవతలకు మొక్కులు చెల్లించడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ముందుగా భక్తులు జంపన్నవాగు లో పుణ్య స్నానాలు చేశారు. తల్లుల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం, చీరె, సారె, పసుపు, కుంకుమలు సమర్పించుకున్నారు.