అటు ప్రేమ సమాజంలోనూ ఇటు అన్న క్యాంటీన్ వద్ద అన్నదానం కార్యక్రమ నిర్వహణ…!
కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యడు… సింహాచల దేవస్థానం చైర్మన్, పీ.అశోక్ గజపతి జన్మదినం సందర్బంగా ఆ పార్టీ నగరంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించింది.తొలుత పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు న్యూపూర్ణ జంక్షన్ వద్ద ఉన్న గణేష్ కోవెలను దర్శించుకున్న అనంతరం..పూల్ బాగ్ వద్ద ప్రేమ సమాజంలో పలువురిని దత్తత తీసుకున్నారు.
ఈ సందర్బఃంగా నగర పార్టీ నేతలు బొద్దల నరసింగరావు…ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అన్న క్యాంటిన్ వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నగర పార్టీ నేతలు మాట్లాడుతూ…పార్టీకి కురువృద్దుడు అయిన అశోక్ గారిలో ఉత్తేజం ఉరకలేస్తోందన్నారు.
యావత్ కుటంబం మొత్తం పార్టీ కోసమే కట్టుబడి ఉందని…పార్టీ అభివృద్ది కోసమే…ఆయన ఆయన బిడ్డ అంకితం అయ్యారన్నారు.ఈ వయస్సులో కూడా…పార్టీకి మొత్తం ఆయన ఆదర్శప్రాయంగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మాకెంతో ఆదర్శప్రాయమన్నారు.
ఈ నెల 25,26 తేదీలలో ఆయనపుట్టిన రోజు సందర్బంగా పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. దాదాపు 500 మందికి పైగా ఉచితంగా తమ రక్తాన్ని దానం చేసారని నేతలు పేర్కొన్నారు.