కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో తమిళ మీడియంలో వైద్య కోర్సులు పరిచయం చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఇన్చార్జ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రకటించారు. పుదుచ్చేరి కంబన్ అరంగంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళిసై మీడియాతో మాట్లాడుతూ పుదుచ్చేరి లోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో అధిక శాతం తమిళ మీడియం పూర్తిచేసిన వారే ఉన్నారని, వీరు తమిళ మీడియంలోనే వైద్య కోర్సు చేసేలా, వాటికి సంబంధించిన పుస్తకాలు కూడా తమిళంలోనే ముద్రించే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అయితే తమిళ మీడియంలో చదువుకొనేందుకు ఆసక్తి ఉన్న వారి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
previous post
next post