ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ప్రకాశం జిల్లాలో ఒక వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఇద్దరు పిల్లలున్న ఆమె చనిపోవడం స్థానికులను కలచివేసింది.
మార్కాపురం కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ మొహమ్మద్ నగర్ లో ఈ దుర్ఘటన జరిగింది. పోరుమామిళ్ల మధుప్రియ అనే వివాహిత ఉరి వేసుకుని కనిపించింది.
అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆమె వయస్సు 27 సంవత్సరాలు. భర్త పోరుమామిళ్ల శ్రీనివాసు ఫారెస్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వారు అబ్బాయి చరణ్ (11) అమ్మాయి పోరుమల్ల భావన శ్రీ (9).