తమ కోర్కెలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రానందున రేపటి నుంచి సమ్మెలోకి వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం (రి.నెం.74/2012) నిర్ణయించింది. తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిర్వాహకుల భావోద్వేగాలను అనుసరించి 20 వ తేది నుండి సమ్మె చేసేందుకు నిర్ణయించి ప్రభుత్వానికి సమ్మె నోటీసు జారీ చేశామని తెలిపారు.
నిర్వాహకులందరూ ఐకమత్యంతో సమ్మెలో పాల్గొని కోర్కెలను సాధించుకునేందుకు రాష్ట్ర సంఘానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. మీ సేవ కేంద్రాల మనుగడ గురించి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత రాక పోవడం, తాజాగా ఏర్పడిన పరిణామాల వల్ల సమ్మెలోకి వెళ్లడం అనివార్యంగా మారిందని వారు తెలిపారు.