క్రీడలతోనే మానసిక ఉల్లాసం పెం పొందుతుందని ప్రముఖ నాయకులు పేర్కొన్నారు. సందర్భంగా రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో టిఆర్ఎస్వీవి నేత బత్తిని ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ సీజన్ -2 కి ముఖ్య అతిథులుగా నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ,టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్ గుప్తా లు హాజరై విజేతలకు క్యాష్ ప్రైజ్ , మేమేంటోలు అందచేసినారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గోల్లూరి అంజయ్య, తెరాస పార్టీ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ , మేకల హనుమంత రెడ్డి , తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగ నాయకులు జయకృష్ణ, బాబు గంగపుత్ర, సంపత్, దినేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి