ఉప్పల్ డివిజన్ లోని లక్ష్మీనారాయణ కాలనిలో డ్రైనేజీ అవుట్లెట్ సమస్య పరిష్కారం కోసం సోమవారం ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి, స్థానిక కార్పోరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వరరెడ్డి, ఈస్ట్జోన్ జోనల్ కమీషనర్ ఉపేందర్రెడ్డి కాలనీలో విసృతంగా పర్యటించారు.
ఈ సందర్బంగా కాలనీలో అవుట్లెట్ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని ఉప్పల్ సర్కిల్ అధికార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ మందముళ్ళ పరమేశ్వర్రెడ్డి, డీసీ అరుణకుమారి , ఈ ఈ.నాగేందర్, ఏఈ వసంత, కాలనీ అధ్యక్షులు లూకాస్, సురేందర్రెడ్డి, రాములు, బొడ్డు రవీందర్, సాయసం నర్సింహ, గోపాల్ అశోక్గౌడ్, నాగేశ్వరరావు, జాకీర్ ,సంజీవయావ్ తదితరులు పాల్నొన్నారు.