37.2 C
Hyderabad
May 6, 2024 20: 44 PM
Slider ఖమ్మం

పోలీసు అమ‌ర‌వీరుల‌కు మంత్రి అజయ్ నివాళులు

#puvvadaajay

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. అక్టోబర్ 21, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరుల సేవలను మంత్రి స్మరించుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డిన పోలీస్ అమరుల సేవలను ప్రజలు ఎన్నటికీ మరువరని అన్నారు. అమరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు.

Related posts

కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్

Satyam NEWS

రచయిత గంగాడి సుదీర్ ను అభినందించిన మంత్రి వేముల

Satyam NEWS

విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ చూపాలి

Satyam NEWS

Leave a Comment