విశేష ప్రాచుర్యం పొందిన కథా సంపుటి ఇగురం రచయిత గంగాడి సుదీర్ ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. గురువారం నాడు మర్యాదపూర్వకంగా హైదరాబాద్ లో మంత్రిని కలిసిన రచయితతో వేముల మాట్లాడారు.
ఇగురం అనే పదం తెలంగాణలో జనబాహుళ్యంలో ఉన్న స్వచ్ఛమైన తెలంగాణ యాసకు సంబంధించిందని, ఇగురం పదం ఎంత ప్రాచుర్యమో సుధీర్ రాసిన పుస్తకం అంతే ప్రాచుర్యం పొందడం సంతోషమన్నారు. మొదటి ముద్రణ జనాల్లోకి వెళ్ళిన విధంగానే త్వరలో రాబోయే రెండో ముద్రణ కూడా ప్రాచుర్యం పొందాలని మంత్రి ఆకాంక్షించారు.