ఉప్పల్ నియోజకవర్గ TUWJ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. మల్లాపూర్ ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో సభ్యులు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షునిగా పి.మహేందర్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షునిగా డి సురేష్, ప్రధాన కార్యదర్శిగా సి.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రుద్రగోని నర్సింగ్ గౌడ్, రాంప్రసాద శర్మ, పి.శ్రీనివాస్, కోశాధికారిగా వేముల శంకర్, సంయుక్త కార్యదర్శులుగా రమేష్ యాదవ్, శ్రీధర్ రావు, డి. శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా జ. శ్రీనివాస రావు, చుక్క రమేష్, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్, కే.సాంబ, ఏ. విజయ్, సలహదారులుగా కే.చంద్రమౌళి, వి.తిరుపతి రెడ్డిలు ఎన్నికయ్యారు.
సమావేశానికి ముఖ్యఅతిథిలుగా ఉప్పల్ ఎమ్మెల్యే} బెతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు జె.ప్రభుదాస్, పి దేవేందర్ రెడ్డి లు హాజరై నూతన కమిటీని అభినందించారు. కార్యక్రమంలో TUWJ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం వెంకటరెడ్డి, జి.బాలరాజు, సీనియర్ నాయకుడు టి. మల్కయ్య కాప్రా, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కడియాల రమేష్ బాబు, నరోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.