40.2 C
Hyderabad
May 2, 2024 17: 58 PM
Slider హైదరాబాద్

తక్షణమే కాలువల పూడికతీత పనులు చేపట్టాలి

#GHMC

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ అంబర్పేట డివిజన్ సి బ్లాక్ లో నేడు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బస్తీ ప్రజలతో కలిసి డ్రైనేజ్, కలుషిత మంచినీటి సమస్యని పరిశీలించి సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వరద నీటి కాలువను పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందితో మాట్లాడి కాలువలో పూడిక తీత పనులు చేపట్టాలని వర్షాకాలంలో స్థానిక బస్తీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ  డివిజన్ అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్, హైమద్, సంతోష్ చారి, వాటర్ లైన్ మాన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

కుట్టుమిషన్లు అందించిన వరల్డ్ ఆర్య వైశ్య మహిళా విభాగం

Satyam NEWS

సింపతీ: నందినీ ఎంత పని చేశావమ్మా

Satyam NEWS

అంబర్పేట్ డివిజన్ లో దారుణం: జిహెచ్ఎంసి ఉద్యోగిపై దాడి

Satyam NEWS

Leave a Comment