జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ అంబర్పేట డివిజన్ సి బ్లాక్ లో నేడు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బస్తీ ప్రజలతో కలిసి డ్రైనేజ్, కలుషిత మంచినీటి సమస్యని పరిశీలించి సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వరద నీటి కాలువను పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందితో మాట్లాడి కాలువలో పూడిక తీత పనులు చేపట్టాలని వర్షాకాలంలో స్థానిక బస్తీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్, హైమద్, సంతోష్ చారి, వాటర్ లైన్ మాన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్