మలబార్ గోల్డ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు 16 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేసినట్టు సురేందర్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా మలబార్ గోల్డ్ ట్రస్ట్ చైర్మన్ జిశాన్,అజిత్, ప్రజా కవి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న నాగర్ కర్నూల్ జిల్లా విద్యాధికారి వెంకటరమణ మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ చైర్మన్ జిశాన్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న పేదింటి బాలికలకు ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి 16 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. చదువులో ప్రస్తుతం బాలికలే ముందున్నారని కొనియాడారు. మంచిగా చదువుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇతర కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
previous post