దీపావళి పండగా వస్తుందంటే చాలు జుక్కల్ నియోజకవర్గంలో పేకాట స్థావరాల కోకొల్లలుగా ఏర్పడతాయి.
అందుకు నిదర్శనమే బుధవారం రాత్రి జరిగిన ఘటన.
పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు బిచ్కుంద మండల కేంద్రంలోని ఓ ఇంట్లో కామారెడ్డి పోలీసు ప్రత్యేక బృందం మెరుపు దాడులు చేయగా 18మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2,77,253రూపాయలు 18సెల్ఫోన్లు,8బైకులను స్వాధీనం చేసుకున్నారు.
బిచ్కుంద తో పాటు జుక్కల్ మద్నూర్ ,పిట్లం ,పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలాలలోని ఆయా గ్రామాలలో స్థావరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం.