విజయనగరం జిల్లా కేంద్రంలో ని కలెక్టర్ ఆడిటోరియంలో డిప్యూటీ సీఎం జిల్లా ఇంచార్జి మంత్రి బూడి ముత్యాల నాయుడు ఆధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులనుద్దేశించి డిప్యూటీ సీఎం ఇంచార్జి మంత్రి ముత్యాల నాయుడు మాట్లాడుతూ మరో ఆరు రోజుల్లో పలు శాఖ ల సిబ్బంది బదిలీలు జరుగుతాయన్నారు.
సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పలు సంక్షేమ పధకాలను అమలు చేస్తు..ప్రగతి పధంలో రాష్ట్రం ముందుకెళుతోందన్నారు.డీఆర్సీ సమావేశానికి హాజరయ్యే జిల్లా అధికారులను తమ పదివితో పరిచయం చేసుకోమని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించడంతో ..మొత్తం అన్ని శాఖ ల అధికారులు తమ.తమ పేర్లతో డిప్యూటీ సీఎం, ఇంచార్జి మంత్రికి పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో నే పోలీసు శాఖ అడ్మిన్ ఏఎస్పీ సత్యనారాయణ, అలాగే నగర డీఎస్పీ త్రినాథ్ ప్రారంభంలో తమ డిజిగ్ నేషన్ తో తెలియజేసారు.
జేడ్పీ అతిథి గృహంలో డిప్యూటీ సీఎం కు స్వాగతం.
సరిగ్గా మధ్యాహ్నం మూడుగంటలకు జిల్లా పరిషత్ అతిథి గృహానికి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు రాగానే జేడ్పీ చైర్మన్ తదితరులు ఆయన ఘన స్వాగతం పలికారు.