ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బాగ్ అంబర్ పేట డివిజన్ రామకృష్ణ నగర్ లోని మోతీహీరా అపార్ట్మెంట్ లో కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు వరద నీటి పోయేందుకు పైప్ లైన్ వేయించాలని, కాలనీలో పలు చోట్ల వీధి దీపాలను ఏర్పాటు చేయించాలని అలాగే కాలనీకి అనుకుని ఉన్న స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలని, డ్రైనేజీ సమస్య వంటి పలు సమస్యలను దృష్టికి తీసుకురాగా వెంటనే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్