మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పుడూర్ లో “సదర్ ఉత్సవాలను” తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా యాదవ సోదరులను మర్రి రాజశేఖర్ రెడ్డి సన్మానించారు.
ఆట పాటలతో అలరించిన దున్నపోతులు
శ్రీ కృష్ణుని వంశంకురం అయిన యాదవ సోదరులు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉందని, తెలంగాణ సంస్కృతిలో సదర్ కు ఒక గణనీయమైన చరిత్ర ఉందని, ఇంట్లో ఏ శుభకార్యం ఉన్న లేదా ఎవరైనా ఆనారోగ్యం బారిన పడిన యాదవులు పాలు పోసే ఇంటికి వస్తారు. ఈ సంస్కృతి సమాజ అభివృద్ధి, శ్రేయస్సు కోసం వారు చేస్తున్నకృషి అని అభిప్రాయపడ్డారు.
పాల వృతి నుంచే ఈ స్థాయికి
రాష్ట్ర ప్రభుత్వం యాదవ సామాజిక వర్గం అభివృద్ధి ఎంతో కృషి చేస్తుందని యాదవ పాడి పరిశ్రమ కోసం ముఖ్యమంత్రి పాటు పడుతున్నారు అని 1946 నుంచి నారాయణగూడలో మొదట పారంభమైన ఈ ఉత్సావాలను కేవలం కొన్ని ప్రాంతాల్లో పరిమితం కాకుండా రాష్ట్రంలో మొదట పుడుర్ లో నుంచి ఘనంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మీ అభివృద్ధి ని కాంక్షిస్తూ ఎళ్లవేళలా మీకు అండగా ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన పుడూర్ సర్పంచ్ బాబు యదవ్, యాదవ్ సంఘం ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, పుడూర్ సర్పంచ్ బాబు యాదవ్, యాదవ్ సంఘం పెద్దలు, నాయకులు,యువకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.