అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సిద్ధిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యాసరస్వతీ శనైశ్వరాలయం వ్యవస్తాపక అధ్యక్షుడు , ప్రముఖ పంచాంగ సిద్ధాంతి శ్రీ యాయవరం చంద్ర శేఖర శర్మ ను మంత్రి హరీష్ రావు పరామర్శించారు.
ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెల్సుకొన్నారు. మెరుగైన చికిత్స అందించాలని మంత్రి వైద్యులను కోరారు.
త్వరగా కొలుకుని అమ్మవారి సేవలో పాత్రులు కావాలని, ఈ ప్రాంత ప్రజలకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.