సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎంపిడిఓ గా జోగు శ్రీనివాసరెడ్డి మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకు ఎంపిడిఓ గా పనిచేసిన గంటా వరప్రసాద్ సెలవుపై వెళ్ళటంతో మేళ్ళచేరువు మండల పరషత్ కార్యాలయంలో సూపరెండెంట్ గా పనిచేస్తున్న జోగు శ్రీనివాసరెడ్డిని జెడ్పి సిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఫుల్ అడిషనల్ ఎంపిడిఓ గా పదవి బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు.ఎంపిపి గూడేపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పదవీ భాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి ని కార్యాలయ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది చంద్రకళ,భాస్కర్,మణి,శైలజ, అరుణ తదితరులు పాల్గొన్నారు.