మెదక్ జిల్లా శివంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో వైస్ ఎంపిపి రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సుదర్శన హోమం కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొత్తగా నిర్మిస్తున్న శ్రీ సీతా రాముల వారి దేవాలయాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మ రెడ్డి, ఎమ్మెల్యేలు చిలుముల మదన్ రెడ్డి, మసనగారి పద్మ దేవేందర్ రెడ్డి, FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.