28.7 C
Hyderabad
May 15, 2024 02: 25 AM
Slider ఆదిలాబాద్

క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నమంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

#indrakaranreddy

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మ‌ల్ నిస్సి చ‌ర్చ్ లో నిర్వ‌హించిన క్రిస్మ‌స్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల స్వార్థాన్ని వీడి ప్రేమ కలిగి జీవించమని చెప్పిన యేసుక్రీస్తు మానవజాతికి ఆదర్శమని మంత్రి  పేర్కొన్నారు.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ..దేశంలో ఎక్క‌డా లేని విధంగా అన్ని మ‌తాల‌కు సంబంధించిన పండ‌గుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ద‌ని తెలిపారు. క్రిస్మ‌స్ పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించడంతో పాటు పేద క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం త‌ర‌పున నూత‌న‌ వస్త్రాలను పంపిణీ చేస్తున్నామ‌న్నారు.

Related posts

దళిత గిరిజన భూముల్ని లాక్కుంటున్న ప్రభుత్వం

Satyam NEWS

మాహిష్మతీ ఊపిరి పీల్చుకో…. రాహుల్ మళ్లీ వస్తున్నాడు..

Satyam NEWS

Analysis: దేశాన్ని కాపాడాల్సింది మేక్ ఇన్ ఇండియా నే

Satyam NEWS

Leave a Comment