దసరా పండుగ సందర్భంగా వనపర్తి వల్లబ్ నగర్ – 33వ వార్డు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయ చైర్మన్ రఘునాథచార్యులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వేద మంత్రాలతో మంత్రికి ఆశీర్వచనం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి 33వ వార్డు కౌన్సిలర్ ఉంగలం ఆలేఖ్య తిరుమల్ దంపతులు, కౌన్సిలర్ నందిమల్ల భువనేశ్వరి-శ్యామ్, సీనియర్ నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్