సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీస్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానానికి నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భారీ విరాళం అందచేశారు.
ఆయనతో బాటు చేజర్ల చలమారెడ్డి కూడా ఉన్నారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి చేసిన వాగ్దానం ప్రకారం స్వామివారి ముఖమండపానికి వెండి తొడుగు చేయించేందుకు ఆరు లక్షల రూపాయలను విరాళం అందచేశారు.
శంభు లింగేశ్వర స్వామి చాలా మహిమాన్వితుడని, మరెక్కడా లేని విధంగా శివలింగం శిరస్సుపై నుండి గంగ నిరంతరం రావటం మహిమాన్వితమైనదని, మొక్కు చెల్లించుకుని రెండవ పర్యాయము స్వామిని దర్శించుకోవడం తనకు సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు.
అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం దాతను వేదమూర్తులు లు, అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బోగాల కొండారెడ్డి, దేవస్థాన మేనేజర్ సిహెచ్. సత్యనారాయణ, పి. శంకర్ రెడ్డి, ఉపసర్పంచ్ బి.లక్ష్మీ శ్రీనివాస రావు పాల్గొన్నారు.
ఇంకా, మల్కాపురం లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు వేము నాగిరెడ్డి, చిన్న పొంగు అశోక్, టి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోగాల బాల వెంకటరెడ్డి, గజ్జల శంకర్ రెడ్డి, సాముల వెంకటరెడ్డి, మానేటి రాముడు, తునికపాటి శ్రీనివాసాచారి, కటకం కేశవరావు పాల్గొన్నారు.
అంతే కాకుండా పెండేగ రవి, ముడెం వెంకటరెడ్డి, జి.గురుస్వామి, దేవస్థాన అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ, ఆలయ జూనియర్ అసిస్టెంట్ కె.కొండారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.