38.2 C
Hyderabad
April 28, 2024 22: 06 PM
Slider గుంటూరు

ఈ ఐదేళ్లూ ఏం పీకావు జగన్ రెడ్డీ?

#balakotaiah

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖే రాజధాని ప్రకటనకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య సీరియస్ అయ్యారు. తాటాకు చప్పుళ్ళుకు కుందేళ్ళు బెదరవు. ఉత్తర కుమార ప్రగల్భాలకు ఓట్లు పడవు. రాజధానిపై ఇనుప పాదం పెట్టినందునే  ఏనుగు లాంటి వైకాపా  పీనుగ అయ్యింది. ప్రభుత్వ పతనం ఆరంభం అయ్యింది అయిన బాలకోటయ్య అన్నారు. మళ్ళీ అమరావతి జోలికొస్తే వైకాపా కు పుట్టగతులు ఉండవ్. ఎన్నికల్లో గెలవగానే విశాఖ రాజధాని అనటం మోకపోతు గాంభీర్యం. ఐదేళ్ళు విశాఖకు ఎందుకు వెళ్ళ లేకపోయావో ముందు చెప్పు మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం పీకారో చెప్పండి అని ఆయన ప్రశ్నించారు. అమరావతి నుంచి ఐదేళ్ళు పాలన చేసి లక్ష కోట్లు కావాలి అంటారా?  ఐదేళ్ళు లక్ష కోట్లతో చేశారా? ఎవరికి కావాలి? మీకు కావాలా? గొడ్డలితో బాబోయ్ ని నరకొచ్చు. కానీ, అమరావతి ని నరక లేరు. భవిష్యత్తు లో చట్టబద్ధమైన అమరావతి జోలికొస్తే, అన్యాయం జరిగితే ప్రత్యేక మధ్యాంధ్ర  రాష్ట్ర  ఉద్యమం చేస్తాం. కృష్ణా , గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, నెల్లూరు 6 ఉమ్మడి జిల్లాల్లోని 2 కోట్ల 80 లక్షల మంది ప్రజలు అమరావతి రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తాం. ఇప్పుడు శాంతిని చూశారు. రేపు ఆత్మాహుతి దళాలను చూస్తారు అని ఆయన అన్నారు.

Related posts

శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుక‌గా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

Satyam NEWS

గిరిజనులకు అండగా నిలిచేందుకు మెగా వైద్య శిబిరం

Satyam NEWS

అర్హులకు ఇళ్ల స్థలాల పంపిణీ

Bhavani

Leave a Comment