రాజకీయ ప్రయోజనాల కోసం నిబద్ధతతో పని చేసే అధికారిపై ఆరోపణలు చేయడం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థాయికి తగదని మంత్రి తలసాని హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్టాడాలని లేకపోతే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించిన విషయం తెలిసిందే. మజ్లీస్ సభలకు, ఆర్ఎస్ఎస్ సభలకు అనుమతి ఇచ్చిన నగర పోలీసు కమిషనర్ కాంగ్రెస్ మీటింగ్ లకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పిసిసి అధ్యక్షుడు నగర పోలీసు కమిషనర్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు.
ఈ సంఘటనకు సమాధానమిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలు, సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదా అని మంత్రి తలసాని ప్రశ్నించారు. ప్రస్తుతం నెలకొన్న కొన్ని పరిస్థితుల్లో ర్యాలీ కి అనుమతించలేదని అంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదని ఆయన అన్నారు.