33.2 C
Hyderabad
May 12, 2024 13: 45 PM
Slider సినిమా

వార్నింగ్: నేను కంటి సైగ చేస్తే చాలు…

balakrishana 31

నా సహనాన్ని చేతగాని తనంగా చూడొద్దు. నేను ఒక్క సైగ చేస్తే చాలు..అంటూ హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. నిన్న తన కాన్వాయ్ ని అడ్డుకోవాలని చూసిన వైసీపీ తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రశాంతమైన హిందూపురంలో ఇలాంటి విష సంస్కృతి ఎపుడూ లేదని, ఇలాంటి పనులను ప్రజలు హర్షించరని నందమూరి బాలకృష్ణ అన్నారు.

వికేంద్రీకరణ అనేది అభివృద్ధి లో జరగాలని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అంశం లో వికేంద్రీకరణ చేయడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ పై కక్ష సాధింపు కోసం రాజధానిని మార్చడం అన్యాయమని ఆయన అన్నారు. ఇలా మొండిగా చేయడం వైసీపీ ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.  రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై త్వరలోనే ప్రజలు సహా తాను కూడా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తానని బాలయ్య అన్నారు.

Related posts

ఈనెల 26న వాహనాల వేలం

Sub Editor 2

ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేయాలి

Bhavani

సిమెంటు కార్మికులకు న్యాయమైన వేతనం ఇవ్వాలి: సిఐటియు

Satyam NEWS

Leave a Comment