39.2 C
Hyderabad
April 28, 2024 11: 26 AM
Slider కడప

టుడే స్పెషల్: మురుగు నీరే ఇక్కడి బిర్యానీ సెంటర్ల ప్రత్యేకత

drainege water

కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డు బిర్యానీ సెంటర్ల  వెనుక వీధి మురుగు నీటితో జలమయం అయింది. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. మలమూత్రాల దుర్గంధం, మురుగు నీటి నుంచి వెలువడుతున్న విషయవాయువులు అక్కడ నివశించేవారి జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. అంతేకాకుండా బిర్యానీ సెంటర్ల నుంచి వెలువడే వ్యర్థాలను వెనుకవైపు ఉన్న  పాడైపోయిన కాల్వలోకి వదలడంతో వీటిని తినేందుకు  వీధి నిండా పందులు సంచరిస్తూ ఉన్నాయి. పందుల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. అదే విధంగా పెరిగిపోతున్న దోమలు, క్రీముల ద్వారా డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలోని చిన్న పిల్లలకు ఎక్కడ అంటు వ్యాధులు సంక్రమిస్తాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Related posts

ప్రభుత్వానికి మంచి పేరు రావడంలో ఎంపీఓ ల కృషి ఎంతో ఉంది

Satyam NEWS

పోలీసులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి

Satyam NEWS

ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment