హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు తన ఓటును నమోదు చేసుకున్నారు.
త్వరలో నిర్వహించే వరంగల్, ఖమ్మం, నల్లగొండ కు జరిగే MLC ఎన్నికలలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలో శానంపూడి సైదిరెడ్డి మండల ఇన్చార్జి తాసిల్దార్ వజ్రాల జయశ్రీ సమక్షంలో తన ఓటును నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 2017వ, సంవత్సరం నాటికి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు అందరూ విధిగా తమ ఓటు నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.