ఇటీవల అకాల మరణం చెందిన సుతారి వేణుగోపాల్ సంతాపసభ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ముందుగా సుతారి వేణుగోపాల్ చిత్రపటానికి పూలమాలవేసి పలువురు కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్ , పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన జిల్లా కార్యదర్శి సుతారి వేణుగోపాల్ అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు.
చిన్నతనం నుండి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పలువురు నాయకుల మన్ననలు పొంది అంచలంచలుగా ఎదిగి పార్టీలో ఉన్నత పదవులను పొందాడని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన సుతారి వేణుగోపాల్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,మండల పార్టీ అధ్యక్షుడు చక్ర వీరారెడ్డి, జక్కుల మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్, ములకలపల్లి రామగోపి, వీరారెడ్డి, రామరాజు, చప్పిడి సావిత్రి, ఎస్.కె.బిక్కన్,
గొట్టెముక్కల రాము,యన్.రాజు, ఇంటిమళ్ళ బెంజిమెన్,పి. వెంకటేశ్వర్లు, పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.