26.7 C
Hyderabad
April 27, 2024 10: 07 AM
Slider ఖమ్మం

డ్యాన్సింగ్ ఫౌంటెన్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

#ministerpuvvada

ఖమ్మం కార్పొరేషన్ లోని లకారం ట్యాంక్ బండ్ లో రూ.1.75 కోట్లతో నిర్మించిన డ్యాన్సింగ్ ఫౌంటెన్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో సస్పెన్షన్ బ్రిడ్జి కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

అన్ని సిద్ధంగా ఉన్నామని కొరియా నుండి తాడు(Rope) రావాల్సి ఉందని రాగానే బిగించి పూర్తి చేస్తామన్నారు. అనుకున్న సమయం కన్నా 2 నెల ముందుగానే డ్యాన్సింగ్ ఫౌంటెన్ పూర్తి చేసిన Rhino Engineers Pvt Limited MD నరేంద్ర నాయుడు ను అభినందించి శాలువతో సత్కరించారు.

లకారంలో మరిన్ని అభివృద్ధి పనులను చేపడతామని అన్నారు. హైదరాబాద్ తరువాత అంతటి సౌకర్యాలను ఖమ్మంలో తీసుకొచచ్చేందుకు కృషి చేస్తూన్నామన్నారు. చెరువు అభివృద్ధిలో సిద్దిపేట కోమటి చేరువుతో పోటీ పడుతున్నామని అన్నారు.

ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి నగర ప్రజలకు ఆహ్లాదంను కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం MD మనోహర్, DE రామకృష్ణ, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్,  RHino Engineers Pvt Limited MD నరేంద్ర నాయుడు, ఈశ్వర్, సుడా చైర్మన్ విజయ్ తదితరులు ఉన్నారు.

Related posts

ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 77వ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

పేకాట ఆడుతూ పట్టుబడ్డ వైసీపీ ఎమ్మెల్సీ కొడుకు

Satyam NEWS

శబ్ద కాలుష్యానికి కారణమైన బుల్లెట్లు సీజ్

Satyam NEWS

Leave a Comment