విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి కి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో శనివారం నాడు ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే కోలగట్ల పేరిట ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ సంఘం రెడ్డి బంగారు నాయుడు, కార్పొరేటర్లు అల్లు చాణిక్య, జి వి రంగారావు, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ శింగి ఈశ్వర్ రావు, అమ్మవారి దేవస్థానం పాలకమండలి సభ్యులు తాడి సురేష్, యువజన విభాగం నాయకులు కరణం రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే కోలగట్ల జన్మదినాన్ని పురస్కరించుకొని నగర మున్సిపల్ కార్యాలయం వద్ద. 12వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ కోటేశ్వర రావు ఆధ్వర్యంలో మహిళలకు ,వృద్ధులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు.