29.7 C
Hyderabad
May 2, 2024 06: 33 AM
Slider ముఖ్యంశాలు

చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

#MLARoja

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో రెండు మేజర్‌ ఆపరేషన్లు జ‌రిగాయి. ఈ రోజు ఆమెను వైద్యులు ఐసీయూ నుంచి సాధార‌ణ‌ వార్డుకు తరలించారు.

ఆప‌రేష‌న్లు జ‌రిగిన నేప‌థ్యంలో రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు.

ఈ విషయాన్ని రోజా భర్త సెల్వమణి తెలిపారు. రోజాకు గ‌త ఏడాదే ఆప‌రేష‌న్లు నిర్వ‌హించాల్సి ఉండ‌గా, క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో వాయిదా ప‌డింద‌ని చెప్పారు.

ఈ ఏడాది జనవరిలో ఆప‌రేష‌న్ చేయించుకుందామ‌నుకున్నారని, అయితే, ఏపీలో స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికల కారణంగా వాయిదా వేసుకున్నార‌ని వివ‌రించారు.

ఆమె ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిపారు. క‌రోనా నేప‌థ్యంలో ఆమెను చూసేందుకు ఎవరూ ఆసుప‌త్రికి రావద్దని ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

అయితే, సర్జరీలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు.

Related posts

ఎయిడెడ్ పాఠ‌శాల‌లపై నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాలి…!

Satyam NEWS

విద్యాశాఖలో అవినీతి, అక్రమాలు చేస్తున్న వారిపై ఫిర్యాదు

Satyam NEWS

గురజాల సిమెంటు ఫ్యాక్టరీలు తక్షణమే ఉత్పత్తి ప్రారంభించాలి

Satyam NEWS

Leave a Comment